Pooja Hegde | ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న కథానాయికలలో పూజాహెగ్డే ఒకరు. స్టార్ హీరోలకు పూజా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. సక్సెస్ స్ట్రీక్లో దూసుకుపోతున్న ఈ భామ స్పీడ్కు ఇటీవలే బ్రేకులు పడ్డాయి. వరుసగా మూడు భారీ ఫ్లాపులతో హ్యట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. గోల్డెన్ లెగ్ అని పిలిచినవారే ఐరెన్ లెగ్ అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ ఫ్లాప్ల వల్ల తన కెరీర్కు దెబ్బపడుతుందా అంటే ఖచ్చితంగా కాదు అని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డేకు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు టాక్.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘జనగణమన’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్కు విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ‘లైగర్’ విడుదల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా పలువురు బాలీవుడ్ తారల పేర్లు వినిపించినా చివరికి పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇటీవలే పూరి, పూజాకు కథ వినిపించగా, తన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో త్రివిక్రమ్, మహేష్బాబు హ్యట్రిక్ చిత్రంతో నటించనుంది. ఇక బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్తో ‘కభీ ఈద్ కభీ దివాళి’ సినిమాతో పాటు రణ్వీర్ సింగ్తో ‘సర్కస్’ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.