ఖుషీ సినిమాలో భూమికని చూసి ఎంత మంది గుండెలు జారి గల్లంతయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన భూమికి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.అయితే ఈ అమ్మడు పవన్ 7వ సినిమా ఖుషీ, మహేష్ ఏడవ సినిమా ఒక్కడు, ఎన్టీఆర్ ఏడవ సినిమా సింహాద్రిలో కథానాయికగా నటించింది. ఈ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించి భూమికకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఇక ఇప్పుడు అలాంటి రికార్డ్ పూజా హెగ్డే అందుకోనుందని తెలుస్తుంది. 2014లో ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హేగ్డే వరుసగా సినిమాలు చేస్తూ తెలుగునాట స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. 2018లో ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో నాయికగా నటించింది. ఇది ఎన్టీఆర్కి 28వ సినిమా కాగా, ఇది సూపర్ హిట్ అయింది.
ఇప్పుడు మహేష్ 28వ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే కన్ఫాం అయింది. పవన్ 28వ సినిమాలోను పూజానే కథానాయికగా ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. ఇది జరిగి మహేశ్, పవన్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే పూజా ఖాతాలో సరికొత్త రికార్డ్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురం’లో కనిపించిన పూజా ప్రస్తుతం.. ‘రాధేశ్యామ్, ఆచార్య’ వంటి సినిమాలో పాటు తమిళంలో ‘బీస్ట్’, బాలీవుడ్ లో ‘సర్కస్, భాయిజాన్’ సినిమాల్లో నటిస్తోంది.