వెయ్యేళ్ల కిందటి చోళ సామ్రాజ్య వైభవాన్ని చూపించిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. రెండు భాగాల ఈ సినిమాలోని తొలి చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించింది. తమిళనాట బాక్సాఫీస్ వసూళ్లలో రికార్డ్ సృష్టించింది. దాదాపు 450 కోట్ల రూపాయల కలెక్షన్స్ దక్కించుకుంది.
ఈ ఘన విజయంతో ఈ సినిమా ద్వితీయ భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తొలి భాగం విడుదల నాటికే సెకండ్ పార్ట్ మూవీ కూడా కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉన్న ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ‘పొన్నియన్ సెల్వన్ 2’ను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా కూడా చరిత్ర సృష్టిస్తుందని చిత్రబృందం నమ్మకంతో ఉన్నారు.