టాలీవుడ్ సినీ పరిశ్రమ మరో లెజెండ్ని కోల్పోయింది. కరోనాకు శివశంకర్ మాస్టర్ బలి కావడంతో పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. కరోనా బారిన పడిన దగ్గర నుంచి మాస్టర్ ఆరోగ్యం విషమించిచడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించారు. అయిన పరిస్థితి చేయి దాటడంతో శివ శంకర్ మాస్టర్ ఆదివారం రాత్రి కన్నుమూసారు.
సోమవారం సాయంత్రానికి శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు పంచవటి కాలనీలోని నివాసానికి పలువురు నటీనటులు, కళాకారులు హాజరై శివశంకర్ మాస్టర్కు నివాళులర్పించారు.
యాంకర్, నిర్మాత, దర్శకుడు ఓంకార్ తోపాటు ఆయన సోదరుడు అశ్విన్ బాబు, శివశంకర్ మాస్టర్ పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓంకార్కి శివ శంకర్ మాస్టార్కి మంచి బాండింగ్ ఉంది. బుల్లితెరపై శివ శంకర్ మాస్టర్ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఆయనకు మెరుగైన చికిత్స అందించి శివశంకర్ మాస్టర్ కరోనా నుండి క్షేమంగా బయట పడేలా చిరంజీవి, ధనుష్, మంచు విష్ణు, సోనూసూద్ వంటి వారు ఎంతగానో ప్రయత్నించారు. కాని విధి కరుణించలేదు.శివ శంకర్ మాస్టర్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని చిరు అన్నారు.