సత్యదేవ్ కథానాయకుడిగా ఓల్డ్ టౌన్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. కన్నడ నటుడు డాలీ ధనంజయ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సత్యదేవ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. వినూత్న కథతో తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికంఠన్ కృష్ణమాచారి, సంగీతం: చరణ్రాజ్, సంభాషణలు: మీరాఖ్, నిర్మాతలు: బాల సుందరం, దినేష్ సుందరం, రచన-దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్.