భావోద్వేగాలు, హాస్యం సమపాళ్లలో మేళవించిన వినోదభరిత కుటుంబకథా చిత్రం ‘ఓ..! సుకుమారి” అని నిర్మాత మహేశ్వర్రెడ్డి మూలి అన్నారు. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా, భరత్ దర్శన్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న దక్షిణాది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్రెడ్డి హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ‘దర్శకుడు భరత్ దర్శన్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఇందులో హీరోయిన్ని టచ్ చేస్తే షాక్ కొడుతుంది. లాజికల్గా ఉండే ఈ యూనిక్ పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ క్రమంలో వచ్చే భావోద్వేగాలు కొత్త అనుభూతినిస్తాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి కారణం ఐశ్వర్య రాజేషే. పైగా మంచి కంటెంట్. నేను పంపిణీదారుడ్ని కాబట్టే థియేటర్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా నిర్మించా. సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంటుంది’ అని మహేశ్వరరెడ్డి మూలి తెలిపారు.