Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఫీల్ అందించేలా సాగుతూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది.
తాజాగా సెకండ్ సింగిల్ ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పారావు పాడింది. గుంటూరు కారంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు.
గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్.. సూపర్ స్టార్ అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్బాబు స్పెషల్ బర్త్డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..