Rajamouli – Mahesh Project | దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో పాటు మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిషాలో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాపై తాజాగా స్పందించింది ఒడిషా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా (Pravati Parida). ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరగడం రాష్ట్రానికి గర్వకారణమని, ఇది స్థానిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాన్ని సినిమా షూటింగ్లకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చుతుందని సూచించారు.
గతంలో మల్కాన్గిరిలో పుష్ప-2 షూటింగ్ జరిగినట్లే.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రం SSMB 29 కోసం కోరాపుట్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇది ఒడిశా పర్యాటక రంగానికి మంచి అవకాశం లాంటింది. ఈ చిత్ర షూటింగ్ వలన ఒడిశా ఫ్యూచర్లో సినిమా షూటింగ్లతో పాటు టూరిజంలకి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషా ఇండస్ట్రీలని స్వాగతిస్తున్నాం. షూటింగ్లకు పూర్తి మద్దతు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇస్తామంటూ ఒడిషా డిప్యూటీ సీఎం ఎక్స్ వేదికగా రాసుకోచ్చింది.
Before, Pushpa-2 in Malkangiri, and now, renowned director SS Rajamouli’s upcoming film SSMB29, starring South superstars Mahesh Babu and Prithviraj Sukumaran, along with internationally acclaimed actress Priyanka Chopra, is being shot in Koraput, proving that Odisha has a wealth…
— Pravati Parida (@PravatiPOdisha) March 11, 2025