టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలతోనే అలరించడమే కాకుండా సేవా కార్యక్రమాలతోను ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్(NTR). ఇటీవల ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళి రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రగాయాలపాలై ఆసుపత్రి పాలయ్యాడు. ఒకదశలో ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు చెప్పారు.
తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో మాట్లాడాలని ఉందని మరళీ(Murali) చెప్పడంతో వైద్యులు వీడియో కాల్ మాట్లాడించారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మురళిని ఎన్టీఆర్ అభిమాన సంఘం కలిసింది. తారక్కు ఫోన్ చేసి మురళితో మాట్లాడించింది. ఈ సందర్భంగా మురళికి ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మురళీ ఆరోగ్య ఖర్చులకు గానూ ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు రూ.2.5లక్షలు అందించారు. తనకు సాయం అందించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, తనతో మాట్లాడిన ధైర్యం నింపిన ఎన్టీఆర్ కు మురళీ కృతజ్ఞతలు చెప్తున్నాడు.