టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడని తెలిసిందే. అయితే తారక్ నెట్టింట్లో తన పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలు కానీ, ఫొటోలు కానీ షేర్ చేసుకోవడం చాలా అరుదు. ఏదో ప్రత్యేకమైన సమయంలో తప్ప ఫొటోలను బయటకు లీక్ చేయడు ఎన్టీఆర్. ఇపుడదే టైం రానే వచ్చింది. ఎన్టీఆర్ కపుల్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కపుల్ (Prashant Neel-likitha) తో కలిసి దిగిన ఫొటో ఇపుడునెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తన సతీమణి ప్రణీతతో కలిసి ప్రశాంత్ నీల్-లిఖిత కపుల్ పక్కనే కూర్చొని కెమెరాకు ఫోజులిచ్చాడు ఎన్టీఆర్. వార్షికోత్సవాలను షేర్ చేసుకున్నపుడు..అది వేడుకలు జరుపుకోవాలని అంటుంది..అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఇద్దరూ వివాహ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నట్టు తాజా స్టిల్ ద్వారా చెప్పాడు తారక్. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31 (NTR 31) ప్రాజెక్టు రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తన కొత్త సినిమాపై ఇలా అఫీషియల్ అప్ డేట్ ఇచ్చేస్తూనే..వ్యక్తిగత జీవితంలో కూడా ప్రశాంత్ నీల్తో మంచి అనుబంధం మెయింటైన్ చేస్తున్నట్టు తాజా స్టిల్తో చెప్పేశాడు ఎన్టీఆర్. మొత్తానికి కేజీఎఫ్ డైరెక్టర్తో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫొటో ఇపుడు మూవీ లవర్స్ లో మరింత జోష్ నింపుతోంది. ఈ ఇద్దరు చేయబోతున్న సినిమా బాక్సాపీస్ను ఏ రేంజ్లో షేక్ చేయబోతుందో అంటూ ఇప్పటి నుంచే అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.