నిఖిల్ కథానాయకుడిగా సుధీర్వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. తొలిషెడ్యూల్ను నలభై రోజుల పాటు లండన్లో చిత్రీకరిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్. నిఖిల్, సుధీర్వర్మల కలయికలో గతంలో ‘స్వామిరారా’ ‘కేశవ’ వంటి చిత్రాలొచ్చాయి.