హారర్, థ్రిల్లర్ జానర్ చిత్రాలను తెరకెక్కించే లక్ష్యంతో నెలకొల్పిన నైట్ షిప్ట్ స్టూడియో గురువారం ప్రారంభమైంది. ఈ బ్యానర్లో తొలి ప్రయత్నంగా మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘భ్రమయుగం’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
చిత్ర దర్శకుడు రాహుల్ సదాశివన్ మాట్లాడుతూ ‘కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో నడిచే కాల్పానిక కథాంశమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది’ అన్నారు. తమ సంస్థలో తొలి చిత్రాన్ని మమ్ముట్టి వంటి గొప్ప నటుడితో తెరకెక్కించడం ఆనందంగా ఉందని నిర్మాతలు చక్రవర్తి రామచంద్రన్, ఎస్.శశికాంత్ పేర్కొన్నారు.