పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్షాహీల నేపథ్య కథతో రూపొందిస్తున్న చిత్రం ‘హరిహరవీరమల్లు’. పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. క్రిష్ దర్శకుడు. దయాకర్రావు నిర్మాత. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ‘ఈ సినిమాలో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో కనిపిస్తుంది. ‘కృష్ణపక్ష పంచమి వెన్నెల వన్నెలవా, శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా? ఓ అందాల పంచమి, ఎవరివే నీవెవరివే’ అని అమె అందాల్ని అభివర్ణించవొచ్చు. భారతీయ సినిమాలో ఓ విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నాం. యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.