తిరుమల: ప్రముఖ సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ జంట శుక్రవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని, స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వవచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిన్న తమిళనాడులోని మహాబలిపురంలో హిందూసంప్రాదాయంగా మూడుముళ్లతో ఒక్కటైన ఈ జంట శ్రీవారి సన్నిధిలోకి వచ్చిన సందర్భంగా ఈ జంటను చూసేందుకు ఆలయ ఆవరణలోకి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఇవాళ ఉదయం అందాల తార దీపికా పదుకొనె శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.