నరేష్ పవిత్రాలోకేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్.రాజు దర్శకుడు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో నరేష్ మాట్లాడుతూ ‘నా రీల్లైఫ్ బాగున్నా..రియల్ లైఫ్ బాగోలేదు. ఈ విషయంలో మా అమ్మ కూడా బాధపడేది.
ఇప్పుడు యాభై ఏళ్లకు మా అమ్మ తర్వాత ఇంకో అమ్మను కలుసుకున్నా’ అన్నారు. పవిత్రాలోకేష్ మాట్లాడుతూ ‘కొన్ని దుష్టశక్తులు నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించాయి. ఆ సమయంలో నరేష్గారు ఓ శక్తిలా నాకు తోడుగా నిలబడ్డారు’ అన్నారు. ఈ వేడుకలో సీనియర్ నటి జయసుధ పాల్గొన్నారు.