తన మాజీ భార్య రమ్య రఘుపతి చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు నటుడు వీకే నరేష్. ఆమెకు 8 ఏళ్లుగా దూరంగా ఉంటున్నానని, నెల కిందటే విడాకుల నోటీసు పంపించానని ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. నటి పవిత్రా లోకేష్ను పెళ్లి చేసుకునేందుకే తనకు నరేష్ విడాకులు ఇస్తున్నట్లు రమ్య రఘుపతి ఆరోపణలు చేస్తున్నది. ఈ విషయంపై నరేష్ మాట్లాడుతూ…‘నాకూ, పవిత్రా లోకేష్ మధ్య ఉన్న స్నేహం గురించి దాచాల్సిన అవసరం లేదు. నా మాజీ భార్య రమ్య రఘుపతికి 8 ఏళ్లుగా దూరంగా ఉంటున్నాను. గత నెల విడాకుల నోటీసు పంపాను.
పవిత్రతో పెళ్లి కోసమే ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు రమ్య రఘుపతి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. రమ్య చేస్తున్న ఆర్థిక మోసాలు, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ను తట్టుకోలేకే ఆమెకు దూరమయ్యా. 50 లక్షల కోసం మా ఇంట్లో వాళ్లను పీడించింది. ఆమె చేసిన అప్పులు తీర్చేందుకు 10 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు బెంగళూరు వెళ్లి న్యూస్ ఛానెల్స్లో నాపై అసత్య ప్రచారం చేయిస్తున్నది.
అక్కడి ఛానెల్స్లో మాట్లాడి వివరణ ఇచ్చాను’ అని అన్నారు. ఈ వివాదంపై నటి పవిత్రా లోకేష్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ…నరేష్ మంచి వ్యక్తి. మా మధ్య దాపరికాలు లేవు. ఆయనకు తోడుగా ఉంటున్నా. 2017 నుంచి నా భర్తకు దూరంగా ఉంటున్నా. రమ్య గురించి నరేష్ అన్ని విషయాలు నాకు చెప్పారు. నరేష్తో రమ్యకు సమస్య ఉంటే వాళ్లిద్దరు తేల్చుకోవాలి. ఇందులోకి నా పేరు తీసుకురావాల్సిన అవసరం లేదు. అని చెప్పింది.