ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారంగ్ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఈయన మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈయన నిర్మించిన ‘లవ్స్టోరి’ మంచి విజయం సాధించింది. నాగశౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాకు ఈయన నిర్మాతగా వ్యవహరించాడు.
ఈయన స్థాపించిన ఏషియన్ మల్టీప్లెక్స్, ఏషియన్ థియేటర్లు తెలుగు రాష్రాల్లో లగ్జరీ థియేటర్లుగా పేరు పొందాయి. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, మూవీ ఫైనాన్షియర్గా నారంగ్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. నిర్మాతగా ఈయన ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ‘ది ఘోస్ట్’తో పాటు, శేఖర్ కమ్ములా, ధనుష్ కాంబోలో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నాడు. వీటితో పాటుగా శివకార్తికేయన్, అనుదీప్ కాంబోలో వస్తున్న సినిమాకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.
నారంగ్ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12గంటలకు ఫిలింనగర్లోని తన నివాసానికి హాస్పిటల్ నుంచి తరలించనున్నారు. సాయంత్రం 4గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.