అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ది ఘోస్ట్ (The Ghost) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫైనల్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాగ్. ఇప్పటికే విడుదలైన లుక్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. కాగా నాగార్జున చేయబోయే కొత్త ప్రాజెక్టుపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. కార్తికేయ 2 సినిమాతో బిజీగా ఉన్న యువ దర్శకుడు చందూమొండేటి (Chandoo Mondeti)తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది.
చందూమొండేటి నాగార్జున కోసం పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీని సిద్దం చేసినట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరి..నాగార్జునకు స్క్రిప్ట్ నచ్చితే సినిమా ప్రకటించడమే తరువాయి అని సినీ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్పై మెరుస్తుందా..?లేదా..? అనేది మరికొన్ని రోజులు ఆగితే క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వస్తున్న కార్తికేయ 2 ఆగస్టు 13న విడుదల కానుంది. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.