బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో కాజల్ .. రవి,లోబోలని ఆట పట్టిస్తుండగా, ఆ క్రమంలో లోబో మిడిల్ ఫింగర్ చూపించాడని కొందరు కామెంట్ చేశారు. దీనిపై నాగార్జున వీడియో ప్లే చేయించి మరీ, నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే నాగ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన లోబో.. అప్పుడే నమాజు చేసుకొని వచ్చాను. తను కావాలని వేలు చూపించలేదని, అక్కడ పైన బల్లి తిరుగుతుంటే దాన్ని చూపించానంటూ దేవుడి మీద ఒట్టేసి చెప్పాడు లోబో.
ఇక నాగ్.. హౌస్మేట్స్తో రూలర్ ఎవరు? బానిస ఎవరు? అన్న టాస్క్ ఆడించాడు. మొదటగా వచ్చిన కెప్టెన్ ప్రియ.. శ్రీరామ్ రూలర్, హమీదా బానిస అని చెప్పింది కాజల్.. అందరితో మంచిగుండాలనుకునే ప్రియను రూలర్గా, అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేసే రవిని బానిసగా చెప్పుకొచ్చింది. త్వరలోనే రవి గేమ్ రవికే బెడిసికొట్టే రోజు వస్తుందని హెచ్చరించింది. ప్రియాంక సింగ్.. రవిని రాజుగా, లోబోను బానిస అని చెప్పుకొచ్చింది.
రవి.. మానస్ను రాజుగా, ప్రియాంక సింగ్ను బానిసగా చెప్పాడు. సన్నీని రాజుగా హమీదాను బానిసగా ఫీలయ్యాడు మానస్. సన్నీ.. మానస్ రాజు, విశ్వ బానిస అని పేర్కొన్నాడు. లోబో.. సన్నీకి కిరీటం ధరించి రాజును చేయగా విశ్వను బానిస అని తెలిపాడు. తర్వాత షణ్ముఖ్.. నాకు నేనే రాజు అని ప్రకటించుకున్నాడు. ఇలాంటి పని చేశావు కాబట్టే 8 మంది నామినేట్ చేశారని నాగ్ అన్నారు . దీంతో కొంత వెనక్కు తగ్గని షణ్ను.. మైండ్గేమ్ ఆడిన రవి కింగ్ అని హమీదా బానిస అని అభివర్ణించాడు.
ఇక హమీదా.. మానస్ను రాజుగా, సన్నీని బానిసగా ఫీలైంది. తర్వాత శ్వేత.. కాజల్ రాణి, మానస్ బానిస అని అభిప్రాయపడింది. జెస్సీ.. రవిని రాజుగా, లోబోను బానిసగా ఫీలయ్యాడు. యానీ మాస్టర్.. సన్నీని రాజుగా, లోబోను బానిసగా పేర్కొంది. సిరి.. రవిని రాజుగాగా, శ్రీరామ్ను బానిసగా ఫీలైంది. తర్వాత విశ్వ రవిని రాజుగా కీర్తించాడు. కెప్టెన్ ప్రియను మాత్రం బానిసగా పేర్కొన్నాడు. ఇక ఈ వారం నామినేషన్లో ఉన్న 9 మందిలో ఒక్కరిని కూడా సేవ్ చేయకుండా సస్పెన్స్ క్రియేట్ చేశాడు. నేటి ఎపిసోడ్లో హమీదాని ఎలిమినేట్ చేయనున్నట్టు తెలుస్తుంది.