Naga Chaitanya -Sobitha | ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక వారు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు నెట్టింట తెగ ప్రచారాలు సాగుతున్నాయి. శోభితా ధూళిపాళ్ల, లావణ్య త్రిపాఠిలు ప్రగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు రాగా, ఆ వార్తలని నిజం చేసింది లావణ్య త్రిపాఠి. సోషల్ మీడియా ద్వారా వారు త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలియజేశారు. ఇక శోభిత కూడా ప్రగ్నెంట్ అంటూ ప్రచారాలు సాగుతున్న సమయంలో శోభిత క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ముంబైలో జరిగిన WAVES -2025 సమ్మెట్లో శోభిత ధూళిపాల వదులుగా ఉండే చీర కట్టుకొని కనిపించడంతో ప్రగ్నెన్సీ రూమర్స్ ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో శోభిత ప్రగ్నెన్సీపై ఆమె టీమ్ స్పందించింది. ‘గుడ్ న్యూస్ ’ ఒట్టి పుకారు మాత్రమే. శోభిత పర్సనల్ లైఫ్ గురించి వినిపిపస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ ఆమె టీమ్ తెలియజేసింది. ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితం ఆస్వాదిస్తుంది, మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది. దీంతో గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక అక్కినేని వారసులు రావడానికి ఇంకాస్త టైమ్ పట్టనుందని అర్థమవుతుంది. గతేడాది డిసెంబర్ లో నాగ చైతన్య, శోభితల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం తెగ సందడి చేస్తుంది.
పెళ్లి తర్వాత కూడా శోభిత గ్లామర్ లుక్స్ షేర్ చేస్తూనే ఉంది. ఒక్కోసారి కేక పెట్టించే అందాలు చూపిస్తూ మైమరిపింపజేస్తుంది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే.. శోభితని వివాహం చేసుకున్న తర్వాత ఆయన కెరీర్లో తండేల్ రూపంలో పెద్ద హిట్ దక్కింది. శోభిత వచ్చిన వేళా విశేషం అని ఇక నుండి చైతూకి అంతా మంచే జరుగుతుందని కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైథాలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండనున్నట్టు అర్ధమవుతుంది.