Balakrishna | నందమూరి బాలకృష్ణ తాజాగా అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో సంచలనం రేపుతున్నాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విజయోత్సవ సభ ఆదివారం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. కాగా ఈ సక్సెస్ వేడుకలో తోటి నటీనటుల గురించి బాలయ్య మాట్లాడుతూ వాళ్లతో కలిసి టైమ్ పాస్ చేసానని, సినిమా కబుర్లు చెప్పుకుంటామని తెలిపాడు. ఈ మాటల సందర్భంలోనే ఆ రంగారావు.. ఈ రంగారావు.. అక్కినేని-తొక్కినేని అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. ఇక ఈ మాటలు అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్ మీడియాలో బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా నందమూరి అభిమానులు, అక్కినేని అభిమానులు ఒకరి మీద ఒకరు ట్విట్టర్లో మాటల యుద్ధం చేసుకుంటున్నారు.
తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ స్పందించారు. సోషల్ మీడియాలో నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు, వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సినిమా సర్కిల్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరి దీనిపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023