అక్టోబర్ 8న విడుదలైన కొండ పొలం చిత్రం ప్రస్తుతం అన్ని థియేటర్స్లో సక్సెస్ ఫుల్గా నడుస్తుంది. అయితే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేందుకు ‘కొండ పొలం’ ప్రమోషన్స్లో భాగంగా ఆ సినిమా డైరెక్టర్ క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్లు వచ్చి ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ‘ఉప్పెన’ చిత్రం చాలా బాగుంది, రెండో చిత్రం ‘కొండపొలం’ కూడా బాగుందని విన్నాన. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఎంచుకుంటున్ననువ్వు చాలా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించారు నాగార్జున.
ఇకఇంత చిన్న వయసులో రకుల్ని ఎలా ప్రేమించావయ్యా అని నాగార్జున చమత్కరిస్తే.. చేయాల్సి వచ్చింది సార్ అని అన్నాడు వైష్ణవ్. ఇక క్రిష్ని కొండ పొలం మెయిన్ థీమ్ గురించి అడిగి తెలుసుకున్నారు నాగ్. అనంతరం వారితో కూడా హౌజ్ మేట్స్ని కొన్ని ప్రశ్నలు వేయించాడు. అయితే శ్రీరామ్ హమీదాని వద్దు అన్నాడు అని కాని నేను అయితే బిగ్ బాస్ టైటిల్ కన్నా హమీదానే ఎక్కువ అని చెప్పే వాడిని అంటూ క్రిష్ చమత్కరించాడు.
ఇక ఎంటర్టైన్మెంట్ ముసుగులో ఎన్నాళ్లు ఉంటావని లోబోను నిలదీయడంతో అతడు నీళ్లు నమిలాడు. ఆ తర్వాత ప్రియాంక సింగ్ ఫినాలే గురించి మాట్లాడుతూ.. తనతో పాటు షణ్ముఖ్, రవి, మానస్, శ్రీరామ్ టాప్ 5లో ఉంటారని అభిప్రాయపడింది. క్రిష్, వైష్ణవ్ల ముందే రవికి క్లాస్ పీకారు. ఏమయ్యా రవి.. ఎవరు ఎలా ఆడాలో నువ్వే చెప్తావ్ నీ గేమ్ ప్లాన్ ఏంటి? అవసరం లేని వాళ్లకి కూడా అడ్వైజ్లు ఇస్తావ్.. ఎందుకు నీతులు ఎందుకు చెప్తావ్ అని అడిగారు నాగార్జున. దానికి నేను ,వాళ్లు ఎప్పుడు అనుకోలేదు. మీరు చెబితనే తెలిసింది సర్ అని రవి అన్నాడు.