‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, భానుశ్రీ జంటగా నటించిన చిత్రం ‘మౌనం’. కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను దర్శకుడు రమేష్వర్మ ఆవిష్కరించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా వుంటుందో చాలా సెన్సిబిల్గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. అక్టోబర్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎమ్.ఎమ్.శ్రీలేఖ.