సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థతో కలిసి మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్లు మోహన్ బాబు బుధవారం ప్రకటించారు. మోహన్ బాబు శైలి కథా కథనాలు, సంభాషణలు ఈ చిత్రంలో ఉంటాయని, పోరాట సన్నివేశాలు, మలుపులు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు చిత్ర బృందం. శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.