మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ డిసెంబర్ 2న విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి జోష్ వచ్చింది. థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. బాక్సాఫీసు వద్ద అఖండ కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాపై అభిమానులే కాక పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహేష్ బాబు, రామ్, అనీల్ రావిపూడి వంటి వారు మూవీపై ప్రశంసలు కురిపించగా, ఇప్పడు మోహన్ బాబు..అఖండ సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది అని అన్నారు. సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ “అఖండ” సినిమా విజయం, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది. విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు బాలయ్యకి, టీంకి శుభాకాంక్షలు,” అని అన్నారు మంచు మోహన్ బాబు.
మా ఎన్నికల్లో బాలయ్య మంచు విష్ణుకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే, బాలయ్య నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ షోకి మొదటి గెస్టులు కూడా మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి ప్రసన్ననే. షోలో బాలయ్య-మోహన్ బాబు చాలా విషయాలు మాట్లాడి ప్రేక్షకులకి మంచి వినోదం పంచారు.