బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మియో చక్రవర్తి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతూ నటిస్తున్న చిత్రం ‘నేనెక్కడున్నా’. మాధవ్ కోదాడ దర్శకుడు. మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాత. నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
దర్శకుడు మాట్లాడుతూ ‘జర్నలిజం, రాజకీయం నేపథ్య కథాంశమిది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలుంటాయి. హీరో హీరోయిన్లు ఇద్దరూ జర్నలిస్ట్ పాత్రల్లో కనిపిస్తారు’ అన్నారు.