Mission Raniganj | ఓ మై గాడ్ చిత్రంతో బాలీవుడ్లో చాలా రోజులకు హిట్ కొట్టాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిషన్ రాణిగంజ్(Mission Raniganj). ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక (The Great Bharat Rescue). బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (parinithi chopra) కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ ట్రైలర్ను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ఇక కేసరి (Kesari) వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత అక్షయ్, పరిణీతి మళ్లీ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి టిను సురేష్ దేశాయ్ (Tinu Suresh Deshayi) దర్శకత్వం వహిస్తుండగా.. పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వశ్ భగ్నానీ నిర్మిస్తున్నాడు.
One man defied the odds in 1989!#MissionRaniganjTrailer out on Monday, 25th September.
Watch the story of Bharat’s true hero with #MissionRaniganj in cinemas on 6th October! pic.twitter.com/tqWKtVYtKG
— Akshay Kumar (@akshaykumar) September 23, 2023
AKSHAY KUMAR: ‘MISSION RANIGANJ’ TRAILER ON 25 SEPT… 6 OCT RELEASE… Team #MissionRaniganj – starring #AkshayKumar and #ParineetiChopra – will unveil #MissionRaniganjTrailer on 25 Sept 2023.
Directed by #TinuSureshDesai… Produced by #VashuBhagnani, #DeepshikhaDeshmukh,… pic.twitter.com/BLcOGoANmR
— taran adarsh (@taran_adarsh) September 23, 2023
1989 నవంబర్ 13న రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ప్రమాదంలో జస్వంత్ సింగ్ గిల్ (Jaswanth Singh gill) అనే మైనింగ్ ఇంజనీర్ బొగ్గు గనుల్లో చిక్కుకున్న 64 మందిని కార్మికులను కాపాడారు. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే.. మైనింగ్ ఇంజనీర్ పాత్రలో అక్షయ్ కుమార్ (Akshya Kumar) కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తికాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్స్ పనుల్లో బీజిగా ఉంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 06న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.