పద్మ శ్రీ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాజమండ్రి (Rajahmundry) లో ఆయన విగ్రహాన్ని సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు. అనంతరం హోమియోపతి కాలేజీ బిల్డింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..
అల్లు రామలింగయ్య నటుడే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు, హోమియో వైద్యుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. 82 ఏండ్లకే ఆయన చనిపోయి ఉండొచ్చు కానీ 18 ఏండ్ల క్రితమే ఆయన నిండూ నూరేళ్లు జీవించాలని చెప్పాలి. అలాంటి మామయ్య గారికి నూరు రోజుల శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామంటే..ఆయన చరిత్రను మనమంతా స్మరించుకోవాలి. మా కుటుంబమంతా ఆయనను ఎప్పుడూ స్మరించుకుంటుంది. అలాంటి పెద్దాయన మా మామయ్య అవడం నేను గర్వంగా ఫీలవుతుంటా. ఈ బిల్డింగ్ కట్టింది నాజేబులో డబ్బులతో కాదు. నేను రాజ్యసభ ఎంపీగా ఉండటం నా అదృష్ణం. ఇలాంటి కార్యక్రమం చేపట్టడానికి..నా జేబులో డబ్బులు ఇచ్చినపుడు ఇది నా చేత్తో ఇచ్చానని గర్వంగా చెబుతాను. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ప్రతీ పైసా నా జేబులో నుంచి ఇచ్చానని అన్నారు.
ఏదో ఒక నియోజకవర్గానికి ఎంపీగా ఉంటే నిధులు అంతటికే పరిమితమయ్యేవి. రాజ్యసభ అవడం మూలంగా ఆ నిధులు ఎక్కడైనా ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ కాలేజీకి నిధులిచ్చే అవకాశం నాకు కలిగింది. మురళీమోహన్ లాంటి మంచి విజన్ ఉన్నమాజీ పార్లమెంట్ సభ్యులున్నారు..కాబట్టి ఇది సాధ్యమైందని అన్నారు. మామయ్య శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కారక్రమానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి , మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రామలింగయ్య గారిని సదా స్మరించుకుంటాం. ఈ హోమియోపతి కాలేజీ ఒక సంజీవనిలా చిరంజీవిలా సాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు.
గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు..
రామమండ్రిలో ఓ కాలేజీ ఉంది. దానికి ఆ కమిటీ సభ్యులంతా కలిసి నా పేరు పెట్టాలనుకుంటున్నారు. అయితే ఆర్థికంగా మనం కొంత సపోర్టు చేయాలని 80ల లో మామయ్య నాతో అన్నారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయన ఎంత డబ్బు ఇవ్వాలని చెబితే అంత ఇచ్చానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇపుడు చెప్పాలి..గర్వంగా అది నా డబ్బు. నా సొంత డబ్బు అని అన్నారు చిరు. ఆ తర్వాత రామలింగయ్య పేరు పెట్టారు.అది ఇలా కొనసాగుతూ ఇంతలా వ్యాప్తి చెందడం శుభారంభమని చిరంజీవి చెప్పుకొచ్చారు.