Megastar Chiranjeevi | కర్ణాటక గడిచిన 30-40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ కరువును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తక్కువ వర్షపాతం కారణంగా బెంగళూరు ప్రజలు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే తీవ్రమైన కరువు పరిస్థితుల నేపథ్యంలో కన్నడ ప్రజలను ఉద్దేశించి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
గత దశాబ్దకాలంలో ఎన్నడూ చూడని కరువు పరిస్థితులను ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొంటున్నది. ఈ విషయం నన్ను నన్ను తీవ్రంగా బాధిస్తుంది. ఈ కరువు నుంచి బయటపడేందుకు ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని మెగాస్టార్ సూచించారు. బెంగళూరులోని తన ఫామ్హౌస్లో ఇలాంటి పద్ధతే అవలంభిచాను. ఇలా చేయడం వలన వర్షపు నీరు కానీ.. మనం వాడుతున్న నీరు కానీ భూమిలోకే ఇంకిపోతుంది. అప్పుడు భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయి అంటూ రాసుకోచ్చాడు. ఇక ఈ పోస్ట్ చిరు కన్నడలో పోస్ట్ చేయడం విశేషం.
ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ… ಬಹಳ ಮುಖ್ಯ.
ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024