Chiranjeevi’s Mother Anjana Devi Hospitalized | మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. మరోవైపు తల్లి అనారోగ్యం విషయం తెలిసి విజయవాడ నుంచి పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.
చిరంజీవి ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నాడు. భార్య సురేఖతో కలిసి గురువారం పెళ్లిరోజు జరుపుకున్న చిరు. అనంతరం దుబాయ్కి వెళ్లాడు. అయితే అంజనాదేవి పరిస్థితి తెలుసుకున్న చిరు వెంటనే బయలుదేరినట్లు తెలుస్తుంది. కొణిదెల వెంకటరావును వివాహం చేసుకున్న అంజనాదేవి.. ఐదుగురికి జన్మనిచ్చింది. ఇందులో మొదటి సంతానం చిరంజీవి కాగా.. ఆ తర్వాత విజయ దుర్గ కొణిదెల, కొణిదెల మాధవి, కొణిదెల నాగేంద్రబాబు, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారు.