బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’, కాశ్మీర పరదేశి నాయిక. రమణన్ దర్శకుడు. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను అగ్ర నటుడు చిరంజీవి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్, సాంగ్స్కు మంచి స్పందన వచ్చింది.
ట్రైలర్ కూడా అందర్ని అలరించే విధంగా వుంది. ప్రేమకథకు సస్పెన్స్ ఎలిమెంట్ జతచేసి రూపొందించిన చిత్రమిది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో నటిస్తున్నాడు. నటుడు ఆర్య ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపిస్తాడు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, భాషల్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు.