కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. గత నెల 10వ తేదీన బైక్ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్కు గాయాలైన సంగతి తెలిసిందే.
సాయితేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చినట్లు చిరంజీవి చెప్పారు. ప్రమాదం నుంచి బయటపడిన సాయితేజ్కు ఇది పునర్జన్మ అని మెగాస్టార్ అన్నారు. శుక్రవారం నాడు సాయితేజ్ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఈ సందర్భంగా సాయితేజ్కు చిరంజీవి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్ కూడా సాయితేజ్కు బర్త్డే విషెస్ తెలియజేశారు.