సినీ పరిశ్రమకు వారసుల హవా కొనసాగుతూనే ఉంది. కొందరు హీరోలుగా ఎంట్రీ ఇస్తుండగా, మరి కొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం అవుతున్నారు. అయితే తెలుగు పరిశ్రమలో హీరోల కూతుళ్లు ఇండస్ట్రీలోకి రావడం తక్కువనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల, మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మీ, నాగబాబు కుమార్తె నిహారిక, రాజశేఖర్-జీవిత కూతుళ్లు శివాత్మిక, శివాణి ఇండస్ట్రీలో రాణిస్తుండగా, ఇప్పుడు శ్రీకాంత్- ఊహ కూతురు కూడా వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్ట ప్రచారం జరుగుతుంది.
శ్రీకాంత్ కొడుకు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కుర్ర హీరో కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లి సందD’అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు కూతురిని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని శ్రీకాంత్ భావిస్తున్నాడట. ఆయన నటవారసురాలు 17 ఏళ్ల మేధ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి.
మేధా శిక్షణ పొందిన భరతనాట్య నృత్యకారిణి.. ప్రస్తుతం కాలేజ్ లో ఉన్న జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. చదువు పూర్తయిన తర్వాత వెండితెరపై అడుగుపెట్టడానికి సరైన దర్శకుడు ప్రొడక్షన్ హౌస్ కోసం వెతుకుతూ తల్లిదండ్రులు ప్రణాళికలు సిద్ధం చేశారని కథనాలొస్తున్నాయి. మేధ ఇంతకుముందు అనుష్క రుద్రమదేవిలో బాలనటిగా పరిచయమైంది. రుద్రమదేవి యంగర్ పాత్రలో కనిపించింది. ఊహ రూపంతో ఉండే మేధ తెలుగు ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.