చాలా కాలంగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడ్డది. ఫైనల్గా మోస్ట్ క్రేజీ కాంబినేషన్ మారుతి (Maruthi)-ప్రభాస్ (Prabhas) ట్రాక్పైకి వచ్చింది. ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా నేడు లాంఛ్ అయింది. హైదరాబాద్లో పూజాకార్యక్రమంతో ప్రభాస్-మారుతి సినిమా ప్రారంభం కాగా..అతికొద్దిమంది మాత్రమే ఈవెంట్కు హాజరైనట్టు సమాచారం.
ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ ప్రాజెక్టులో తమిళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్గా మెరవనుందని తెలుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (Peoples Media Factory) బ్యానర్పై తెరకెక్కుతుంది
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో స్పష్టత రానుంది. రీసెంట్గా పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు మారుతి. ఇక ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్టు కే, ఆదిపురుష్ సెట్స్ పై ఉన్నాయి.