Mark Antony | తెలుగు, తమిళంలో సుపరిచితుడైన విశాల్ (Vishal) నటిస్తోన్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్జే సూర్య (SJ Surya), సెల్వ రాఘవన్ (Selva Raghavan), సునీల్ (Sunil) ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్తో పాటు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై తిరుగులేని హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి బిగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది.
Countdown has begun! 2 Days To Go!!
Bookings Open for the much-awaited sci-fi gangster drama #MarkAntony
Worldwide in Theatres – Sep 15 !!
Book @ https://t.co/tRSzhnJLjo
Already trending on @bookmyshow#MarkAntonyFromSep15
Welcome to the #WorldOfMarkAntony @VishalKOfficial… pic.twitter.com/8x6jcGEhqW— Vamsi Kaka (@vamsikaka) September 13, 2023
ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్పై వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశాల్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ డిటెక్టివ్ ఫిల్మ్ను హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తున్నాడు. విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.