వరుణ్ తేజ్ కొత్త సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సందీప్ ముద్ద నిర్మాత. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.
ఎయిర్ఫోర్స్ యాక్షన్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాయికగా బాలీవుడ్ తార మానుషీ చిల్లర్ను ఎంపికచేశారు. ఆమెను సినిమాలోకి ఆహ్వానిస్తూ చిత్రబృందం ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. రాడార్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ…అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రంతో బాలీవుడ్లో నాయికగా అరంగేట్రం చేసింది.