Actress Manisha Koirala | మూడు దశాబ్దాల క్రితం నాగార్జున నటించిన ‘క్రిమినల్’ సినిమాతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చింది నేపాలి హీరోయిన్ మనీషా కొయిరాలా. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బాంబే’, ‘ఒకే ఒక్కడు’, ‘బాబా’ వంటి సినిమాలతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత మనీషా దక్షిణాదిలో ఎక్కువగా కనిపించలేదు. కాగా తాజాగా ఈ బ్యూటీ సౌత్లో ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో బాబా సినిమా వల్లే సౌత్లో తన కెరీర్ ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
భారీ అంచనాలతో రిలీజైన బాబా సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిందని మనీషా కొయిరాల తెలిపింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తను ఊహించినట్లుగానే సౌత్ కెరీర్ క్లోజ్ అయ్యిందని, బాబాలో నటించడానికి ముందు చాలా సౌత్ ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నాయిని వెల్లడించింది. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో అవకాశాలు ఆగిపోయాయని చెప్పింది. అయితే విచిత్రంగా బాబా రీ-రిలీజ్ చేసినప్పుడు మాత్రం సూపర్ హిట్ కొట్టిందని వెల్లడించింది. కాగా బాబా తర్వాత మనీషా కమల్తో కలిసి ముంబాయ్ ఎక్స్ప్రెస్ మూవీ చేసింది. ఈ సినిమా భారీ విజయం సాధించినా.. సౌత్లో ఆమెకి అవకాశాలు కరవుయ్యాయి.
ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికీ రజనీ కెరీర్లో బెస్ట్ చిత్రాల్లో బాబా సినిమాను ఒకటిగా చెప్పుకుంటారు. కమర్షియల్గా ఈ సినిమా సక్సెస్ సాధించకపోయినా.. కాన్సెప్ట్ మాత్రం అందరికి నచ్చింది. రజనీ ఈ సినిమాలో నటించడంతో పాటు స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో దక్షిణాదిన అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన సినిమాగా రేర్ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమలాఓ బాబా లుక్స్ గానీ, యాటిట్యూడ్ గానీ కొత్తగా ఉంటాయి. ఇక ఇటీవలే రజనీ బర్త్డే సందర్భంగా రీ-రిలీజై రికార్డులు సృష్టించింది.