Ponniyin selvan-1 Glimps | సినిమాల యందు మణిరత్నం సినిమాలు వేరయా. మణిరత్నం నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీప్రముఖులు కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈయన టేకింగ్ గాని, విజువలైజేషన్ గాని వేరే లెవల్లో ఉంటాయి. ఈయన సినిమాల్లో కథలు సాధారణంగానే ఉన్న కథనం గొప్పగా ఉంటుంది. ఇప్పుడోస్తున్న ఫిలింమేకర్స్ అందరు దాదాపుగా మణిరత్నం అభిమానులే అయ్యుంటారు. ఎందుకంటే మణిరత్నం తన సినిమాలతో ఎంటర్టైన్ చెయ్యడమే కాకుండా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంటాడు. ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయినా మణిరత్నంతో ఒక్క సినిమా చేయాలని ఆశ పడుతుంటారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. ఈ చిత్ర మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘చోళులు వస్తున్నారు’ అంటూ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Look out! Brace yourself.
Get ready for an adventure filled week!
The Cholas are coming! #PS1 🗡 @LycaProductions #ManiRatnam pic.twitter.com/9Ovj3I8GXW— Madras Talkies (@MadrasTalkies_) July 2, 2022