సినీ ఇండస్ట్రీలో కొన్నికాంబోలుంటాయి. ఈ కాంబోలలో సినిమా సెట్టయిందంటే ప్రేక్షకులే కాదు, సినీ సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో మహేష్బాబు- త్రివిక్రమ్ ఒకటి. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు క్లాసిక్స్గా మిగిలాయి. టీవీలో వచ్చిన ప్రతిసారి ఈ రెండు చిత్రాలు మంచి టీఆర్పీను సొంతం చేసుకుంటాయి. కాగా ఇటీవలే ఈ కాంబోలో మూడో సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాలలో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే మహేష్ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం మలయాళ స్టార్ హీరోను ఎంపిక చేయాలని అనుకుంటున్నాడట. ఆ మలయాళ స్టార్ హీరో ఎవరా? అని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు పృథ్విరాజ్ సుకుమారన్. ఈ మధ్య పృథ్విరాజ్ పేరు టాలీవుడ్లో మార్మోగిపోతుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో మహేష్కు సమానంగా ఉండే పాత్ర కోసం పృథ్విరాజ్ను ఎంపిక చేయాలని భావిస్తున్నాడట. అయితే గతంలో కూడా ఈ పాత్ర కోసం హీరో నానిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై మేకర్స్ స్పందించలేదు. ఇప్పుడేమో ఏకంగా మలయాళ స్టార్ హీరోనే నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరీ ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక& హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేష్కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడట.