Writer Padmabhushan | టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ (suhas) నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan). షణ్ముఖ ప్రశాంత్ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీ ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్గా విడుదలవుతుంది. సుహాస్ టీం ఇప్పటికే ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.
ప్రమోషన్స్ లో భాగంగా వేసిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన వస్తోంది. కాగా ఇప్పుడొక ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాను ఎంతో ఆరాధించే మహేశ్బాబును ఎస్ఎస్ఎంబీ 28 సెట్స్లో కలిశాడట సుహాస్. రైటర్ పద్మభూషణ్ టీంకు విషెస్ తెలియజేసిన మహేశ్ బాబు ఫిబ్రవరి 4న ఖచ్చితంగా సినిమా చూస్తానని చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్.
టీనా శిల్పరాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరి ప్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్-లహరి ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్తో బిజీగా ఉన్నాడు మహేశ్ బాబు.
రైటర్ పద్మభూషణ్ ట్రైలర్..