సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ సినిమాల కోసం అభిమానులు కళ్లల్లోఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. తాజాగా మహేష్ సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రం దుబాయ్ లోని పలు లొకేషన్ లలో కీలక యాక్షన్ ఘట్టాలతో పాటు ఛేజింగ్ సీన్ లని పూర్తి చేసుకుంది . ఇక కొన్ని రోజులుగా ఉప్పల్ మెట్రో డిపోలో పలు యాక్షన్ ఘట్టాలని జరుపుకుంటుంది. అయితే అక్కడ మహేష్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని జనాలు భారీగా హాజరయ్యారు.
అనూహ్యంగా అభిమానుల తాకిడి పెరగడంతో చిత్ర బృందం మెట్రో డిపోలో షూటింగ్ని అర్థాంతరంగా నిలిపి వేశారు. ఇక్కడ మహేష్ బాబు.. విలన్ ని బైక్ మీద వెంబడించే సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఆ తరువాత ఇదే ప్లేస్లో మేకర్స్ సముద్రకని సీక్వెన్స్ ని కూడా షూట్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.