సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో తెగ సందడి చేస్తుంటాడు. ముఖ్యంగా పిల్లలకు పూర్తి క్వాలిటీ టైమ్ ను కేటాయిస్తుంటాడు. చిన్న పిల్లాడిలా మారి వారితో తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. ప్రస్తుతం మహేష్ తన తాజా చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లారు. నమత్ర మరియు కుటుంబ సభ్యులు అంతా కూడా విదేశీ టూర్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత మరియు సితారలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు పెడుతున్నారు.
తాజాగా మహేష్ బాబు .. కూతురు సితార మరియు గౌతమ్ తో స్విమ్ చేస్తూ సరదాగా సమయంను గడుపుతున్న ఫొటోను షేర్ చేయడం జరిగింది. స్ర్పింగ్ సీజన్ లో వాటర్ లో ఇలా ఎంజాయ్ చేయడం అది కూడా నా ఇద్దరు పిల్లలతో చాలా ఆనందంగా ఉందటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోలో ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో చేయడం జరిగింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.