Actor Simbu | తమిళ స్టార్ హీరో శింబుకు తమిళనాడు కోర్టు షాక్ ఇచ్చింది. కరోనా కుమార్ అనే సినిమాను పూర్తి చేయడానికి సహకరించడం లేదనే ఆరోపణలపై దాఖలైన కేసులో శింబుకు చేదు అనుభవం ఎదురైంది. వేల్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మాత గణేష్ దాఖలు చేసిన పిటీషన్పై విచారణ నిర్వహించిన కోర్టు.. శింబుకు రూ.1 కోటీ రూపాయల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా కోర్టులో డిపాజిట్ చేయాలని మద్రాస్ కోర్టు సూచించింది.
వేల్స్ సంస్థలో శింబు కరోనా కుమార్ అనే ఓ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సినిమాకు జీ. గోకుల్ నిర్మాత. కాగా ఈ సినిమాలో నటించాడానికి శింబుకు రూ.9.5 కోట్లు పారితోషికం ఇవ్వడానికి అంగీకరించాడు. అడ్వాన్స్ రూపంలో రూ.4.5 కోట్లు శింబుకు వేల్స్ సంస్థ నిర్మాత ఇచ్చాడు. కాగా అడ్వాన్స్ అందుకున్న తర్వాత శింబు ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయడానికి సహకరించకపోగా నిర్మాతను ముప్పు తిప్పలు పెడుతున్నాడని ఆరోపణలతో కేసు నమోదైంది.
అయితే శింబుతో వేల్స్ సంస్థ జరిపిన ఒప్పంద పత్రంలో 1 కోటి రూపాయలు చెల్లించినట్టు స్పష్టమైంది. 4.5 కోట్లు చెల్లించినట్టు ఎక్కడా లేకపోవడంతో కోర్టు కేవలం కోటి రూపాయలు దాఖలు చేయాలని తన తీర్పులో వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాట ఇది సంచలనంగా మారింది.