టాలీవుడ్ (Tollywood) హీరో నితిన్ (Nithiin) నటిస్తోన్న చిత్రం మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam). ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. అయితే డైరెక్టర్ కొన్ని కులాలను ఉద్దేశించి ట్వీట్లు పెట్టినట్టు ఫేక్ న్యూస్ సృష్టించి ఆన్లైన్లో వైరల్ చేస్తున్న నేపథ్యంలో..ఈ మూవీ డైరెక్టర్ అండ్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, నిర్మాత సుధాకర్ రెడ్డి టీంహైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పుకార్లు సినిమాకు ఇబ్బంది కలిగించడమే కాకుండా.. తన వ్యక్తిగత కెరియర్కు తీరని నష్టం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు డైరెక్టర్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ ట్వీట్లు ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్కుమార్ ఆకెళ్ల మాచెర్ల నియోజకవర్గం చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
#MacherlaNiyojakavargam director M.S. Rajashekar Reddy filed a case with Cyber Crime Department against fake tweets. @SrSekkhar pic.twitter.com/Ke0KrglhUE
— Suresh Kondi (@SureshKondi_) July 27, 2022