MAA Elections | మా కార్యవర్గ ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు.. ప్రత్యారోపణలు మరో స్థాయికి చేరాయి.రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. మరో కొన్ని గంటల్లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మూడు, నాలుగు సెంటర్లలో డబ్బు పంచుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని సీనియర్ నటుడు నరేశ్ ఆరోపించారు. వాళ్లిచ్చే డబ్బు తీసుకుని విష్ణుకు ఓటేయండని సభ్యులను కోరారు.
దీనిపై ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ప్రెసిడెంట్గా పోటీలో ఉన్న నటుడు శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడం ఆపేయాలని నరేశ్కు వార్నింగ్ ఇచ్చారు. వారే డబ్బులివ్వడానికి మనుషుల్ని పెట్టి, ప్రకాశ్ రాజ్ ఇస్తున్నాడని చెప్పించేలా ప్లాన్ చేశారన్నారు.
సభ్యులంతా దీన్ని గమనించాలని శ్రీకాంత్ కోరారు. ఇటువంటి కల్చర్లెస్ పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. దసరా సందర్భంగా పూజలు చేసే అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. తాము ఏదైనా తేడా చేస్తే అమ్మవారే తమను నాశనం చేస్తుందన్నారు.