Pakka Commercial Ticket Price | హిట్లు ఫ్లాప్లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు గోపిచంద్. గత కొంత కాలంగా ఫ్లాప్లతో సతమతమవుతున్న గోపిచంద్కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. ప్రశంసలతో పాటు కమర్షియల్గా కూడా ఈ చిత్రం మంచి వసూళ్ళను రాబట్టింది. ప్రస్తుతం ఈయన నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ టిక్కెట్ రేట్లను ప్రకటించారు.
‘పక్కా కమర్షియల్’ చిత్రానికి తెలంగాణలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్లో రూ.160గా ఉండునుంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా మల్టీప్లెక్స్లో రూ.150గా ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ టిక్కెట్ రేట్లతో ఏ సినిమా విడుదల కాలేదు. దీనిపై పలువురు నెటీజన్లు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. ఇకపై విడుదలయ్యే సినిమాలకు ఇదే రేట్లు కంటీన్యూ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో వస్తారని నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ, రావురమేష్ కీలకపాత్రల్లో నటించారు. యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో గ్రాండ్గా జరుగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నాడు.