Project-K Movie | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ వచ్చిన ప్రభాస్ సినిమాల విషయంలో జోరు తగ్గించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలను సెట్స్పైన ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. అయితే షూటింగ్ ప్రారంభై నెలలు గడుస్తున్న ప్రభాస్కు సంబంధించిన ఒక్క ఫోటోను కూడా రిలీజ్ చేయలేదని ‘ప్రాజెక్ట్-K’ మేకర్స్పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. కాగా షూటింగ్ సెట్లోకి లెజండరి డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ వచ్చాడు. ఆయనతో కలిసి ప్రభాస్ ఓ ఫోటో దిగాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ముందు నుండి ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ పరోక్షంగా ఉన్నాడు. ఈ విషయాన్ని పలుసార్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపాడు. సై-ఫై జానర్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా సింగీతం శ్రీనివాస్ ఆల్రెడీ టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఆదిత్య 369 తెరకెక్కించి బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించాడు. దాంతో నాగ్ అశ్విన్ ఆయనతో కథా చర్చలు, పలు విషయాలలో హెల్ప్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2024 ప్రథమార్థంలో రిలీజ్ కానుంది.
#prabhas with legendary director #singeethamsrinivasarao on the sets of #projectk 😍
.
.
.@nagashwin7 #prabhas #darling #deepikapadukone #prabhasfans #prabhasdarling pic.twitter.com/XFzxr6CG13— SIIMA (@siima) December 9, 2022