రాజీవ్ సాలూరి, దీప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆఖరి ముద్దు’. సీవీ ఆర్ట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో సీవీ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. దర్శకనిర్మాత సీవీ రెడ్డి మాట్లాడుతూ ‘వినూత్నమైన కథాంశమిది. సమాజానికి మార్గదర్శనం చేయాలనే లక్ష్యంతో తయారుచేసుకున్నా. తెలుగు ప్రేక్షకులు కొత్త అనుభూతిని అందిస్తుంది’ అన్నారు. సీత కాకరాల, పవిత్ర లోకేష్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆండ్రూ బాబు, సంగీతం: కోటి, ఆర్ట్: మౌళి, కథ, స్క్రీన్ప్లే, నిర్మాత, దర్శకత్వం: సీవీ రెడ్డి.