ప్రణయనాథ, మధుబాల జంటగా నటిస్తున్న చిత్రం ‘ల్యాండ్ మాఫియా’. బాబు వీన్ దర్శకుడు. మంగళవారం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘యాక్షన్ ప్రధానంగా నడిచే చిత్రమిది. ప్రేమకథ కూడా ఉంటుంది’ అన్నారు. కమర్షియల్ అంశాలు కలబోసిన సందేశాత్మక చిత్రమిదని, ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నామని హీరో, నిర్మాత ప్రణయనాథ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్చంద్ర.