తెలుగులో ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించినా..కమర్షియల్గా మాత్రం ఆశించిన సక్సెస్ను సొంతం చేసుకోలేకపోయింది బాలీవుడ్ భామ కృతిసనన్. అయితే హిందీ సినీరంగంలో మాత్రం ఆమెకు మంచి పేరుంది. విలక్షణ కథాంశాల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నది. ఈ సొగసరి సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నది. వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శౌర్యువ్ దర్శకత్వంలో ఇటీవలే భారీ పాన్ ఇండియా చిత్రం మొదలైన విషయం తెలిసిందే. మైథాలజీ అంశాలతో సాగే యాక్షన్ డ్రామా ఇది.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విజయ్ దేవరకొండ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో కృతిసనన్ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. బాలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన నటి కావడంతో మేకర్స్ ఆమెను ఫైనలైజ్ చేశారని అంటున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత కృతిసనన్ తెలుగు సినిమాలో నటించబోతున్నది.